హీరో చిరంజీవి తన 154వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తుండగా..ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.
తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ చక్కర్లు కొడుతున్నది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల తేదీని ఖరారు చేసుకుందట. వచ్చే ఏడాది జనవరి 13న చిరంజీవి 154వ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం. దీన్ని చిత్రబృందం ఖరారు చేయాల్సి ఉంది. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి మరో కొత్త సినిమా ‘గాడ్ఫాదర్’ నుంచి సల్మాన్, చిరు చిందేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ లిరికల్ పాట ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది.