Meera Chopra | గతేడాది లాగే ఈ ఏడాది కూడా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే 2024లో పలువురు బాలీవుడ్ తారలు వివాహాబంధంతో ఒక్కటవ్వగా.. తాజాగా మరో నటి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. తెలుగులో బంగారం, వాన సినిమాలతో మెప్పించిన మీరా చోప్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన రక్షిత్ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో మీరా ఏడడుగులు వేయనుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటి కాబోతుంది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన డేట్స్ కూడా వచ్చేశాయి.
మార్చి 12న రాజస్థాన్ జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ రిసార్ట్స్లో వీరి పెళ్లి జరగనుండగా.. కేవలం కుటుంబసభ్యులు, పలువురు బంధుమిత్రులు మాత్రమే హాజరుకానున్నారు. ఈ పెళ్లి వేడుక రెండు రోజులు జరుగనుండగా.. మార్చి 11న మెహందీ ఫంక్షన్, సాయంత్రం సంగీత్, మార్చి 12వ రోజు సాయంత్రం పెళ్లి, రాత్రికి రిసెప్షన్ జరగనుంది.
మీరా చోప్రా 2016లో ‘1920: లండన్స చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్’, ‘సెక్షన్ 375స లో సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా తెలు గులోపవన్ కల్యాణ్ సరసన బంగారం, వినయ్ రాయ్ సరసన వానా చిత్రంలో నటించింది. ప్రస్తుతం మీరా సఫేద్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.