Meenakshi |తెలుగుతెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న నటి మీనాక్షి చౌదరి గత ఏడాది తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వరుసగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ, దాదాపు ఒక సంవత్సరం పాటు కొత్త సినిమాలు సైన్ చేయకుండా కేవలం ఒక్క ప్రాజెక్ట్కే పరిమితమవడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న మీనాక్షికి, ఆ విజయం తర్వాత అనేక కథలు వినిపించాయి. స్టార్ హీరోలు, క్రేజీ కాంబినేషన్ల నుంచి ఆఫర్స్ వచ్చినా, ఆమె మాత్రం వాటన్నింటికీ నో చెప్పిందట. దీనికి కారణం ‘అనగనగా ఒక రాజు’ సినిమా. హీరో నవీన్ పోలిశెట్టి, నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్ట్కి పూర్తి కమిట్మెంట్ కావాలని కోరడంతో, మీనాక్షి ఈ సినిమాకే తన సమయాన్ని మొత్తం కేటాయించాలని నిర్ణయించుకుంది.
ఈ నిర్ణయం అంత సులువు కాదు. “ఒక ఏడాది పాటు ఒక్క సినిమా మాత్రమే చేయడం… అది కూడా రిస్క్. సినిమా ఫెయిల్ అయితే కెరీర్పై ప్రభావం పడుతుందేమో” అనే భయం ఆమెకు మొదట్లో ఉందట. అయినప్పటికీ కథ, పాత్ర మీద నమ్మకంతో ముందుకెళ్లింది. షూటింగ్, ప్రిపరేషన్, క్యారెక్టర్ డెవలప్మెంట్అన్నింటికీ ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పుడు ఫలితం ఆమెకు అనుకూలంగా వచ్చింది. ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా, మీనాక్షి నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. పాత్రలో ఆమె చూపించిన పరిపక్వత, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది పాటు చేసిన కృషి వృధా కాలేదని, ఆమె తీసుకున్న రిస్క్ సరైన నిర్ణయమేనని ఈ విజయం నిరూపిస్తోంది.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… సంక్రాంతి సీజన్ మీనాక్షికి లక్కీగా మారుతోంది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నం’ తో హిట్, ఈ ఏడాది ‘అనగనగా ఒక రాజు’ తో మంచి పేరు తెచ్చుకుంది. వరుసగా సంక్రాంతి సినిమాలతో సక్సెస్ అందుకోవడంతో, ఇండస్ట్రీలో ఆమెను ఇప్పుడు “సంక్రాంతి లక్కీ చార్మ్”గా కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి కొత్త ప్రాజెక్ట్లపై ఇంకా అధికారికంగా సంతకం చేయలేదు. అయితే ఈ విజయం తర్వాత ఆమె కెరీర్ మరో దశలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలతో, బలమైన కథలతో ముందుకెళ్తే, ఆమెకు టాలీవుడ్లో మరింత స్థిరమైన స్థానం దక్కడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.