సినీరంగంలో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాలి. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కితే చాలు కెరీర్కు బ్రేక్ దొరికినట్లే అని చాలా మంది కథానాయికలు భావిస్తారు. తాజాగా యువ నాయిక మీనాక్షి చౌదరి ఇలాంటి బంపరాఫర్ను దక్కించుకుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే..మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకుందని చెబుతున్నారు. దీంతో రెండో నాయిక అయిన శ్రీలీలను ప్రధాన కథానాయికగా తీసుకోబోతున్నారని సమాచారం.
సెకండ్లీడ్లో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ ఆ తర్వాత ‘హిట్-2’ ‘ఖిలాడి’ చిత్రాల్లో నటించింది. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందలేకపోయింది. ఒకవేళ ఈ భామ మహేష్బాబు సరసన అవకాశం దక్కిం చుకుంటే కెరీర్కు మంచి బ్రేక్ దొరికినట్లేనని ఆమె సన్నిహితులు అంటున్నారు.