అయిదేళ్ల క్రితం వచ్చి విజయం సాధించిన ‘మత్తువదలరా’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీసింహా కోడూరి, సత్య, ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై చిరంజీవి(చెర్రి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈచిత్రం ఈ నెల 13న విడుదలై థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్మీట్లో హీరో శ్రీసింహా మాట్లాడుతూ ‘మా సినిమాను అనుకున్నదానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. పార్ట్ 3 కోసం మీలాగే నేనూ ఎదురుచూస్తున్నా.’ అన్నారు. ఈ సినిమాను ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అని చాలామంది అంటున్నారని నిర్మాత తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందీ సినిమా. దసరా సెలవల్లోనూ ఈ రన్ కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాం. ఇదే ఉత్సాహంతో ‘మత్తువదలరా 3’ బ్రహ్మాండంగా చేస్తాం’ అని నిర్మాత వై.రవిశంకర్ తెలిపారు.