తమిళ నటుడు విశాల్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇండస్ట్రీ సమస్యలపై పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం సెక్రటరీగా కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడు.
ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ ’ హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో బోర్డు సభ్యులు 6.5లక్షల లంచం తీసుకున్నారని విశాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా విశాల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రధాన మంత్రిని అభ్యర్థించారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం అవినీతి అధికారులిద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్ సెన్సార్ విషయంలో నిబంధనలను సడలించింది. తమిళ అనువాద చిత్రాలకు ముంబయిలో సెన్సార్ చేయించాల్సిన అవసరం లేదని, తమిళనాడులోనే సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోవచ్చని ఉత్తర్వులు జారీ జేసింది. ఇక నుంచి తమిళ నిర్మాతలు తమ సినిమాల హిందీ వెర్షన్ డబ్బింగ్ కోసం ముంబయికి వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. విశాల్ పోరాటం ఫలితంగానే ఈ సవరణలు జరిగాయని తమిళ ఇండస్ట్రీ వర్గాలు స ంతోషం వ్యక్తం చేశాయి.