Mark Antony | తెలుగు, తమిళం సుపరిచితుడైన విశాల్ (Vishal) నటిస్తోన్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్జే సూర్య (SJ Surya), సెల్వ రాఘవన్ (Selva Raghavan), సునీల్ (Sunil) ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు.
ఇప్పటికే చెన్నైలో చేసిన వేడుకకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగులోనూ అదే స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం ఫిలింనగర్లోని జే.ఆర్.సీ కన్వెషన్ హాల్ను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 10 తేదిన ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో, పవన్ కళ్యాణ్ హార్డ్కోర్ ఫ్యాన్ నితిన్ (Nithiin) చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
. @actor_nithiin will grace the grand pre-release event of @VishalKOfficial @iam_SJSuryah ‘s crazy project #MarkAntony to be held today @ JRC Conventions
Event By @JMedia_Factory#MarkAntonyFromSep15@gvprakash @Adhikravi @vinod_offl @vikramswamy75 @PROSaiSatish pic.twitter.com/qF8MWugvFy
— BA Raju’s Team (@baraju_SuperHit) September 10, 2023
ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్పై వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశాల్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ డిటెక్టివ్ ఫిల్మ్ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.