“ప్రేక్షకుడి టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అని విశాల్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మార్క్ ఆంథోనీ’. అథిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్కుమార్ అందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్మీట్లో విశాల్ మాట్లాడారు. “ ఎస్.జె.సూర్యతో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం. దర్శకుడు అథిక్ ఈ కథ నేరేట్ చేసినప్పుడు హిట్ సినిమా అని అర్థమైపోయింది.
ఈ సినిమాకు తెగిన ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయిని రైతులకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా చూడనివాళ్లుంటే థియేటర్లో చూడండి.” అన్నారు విశాల్. ఎస్.జె.సూర్య మాట్లాడుతూ-“ విశాల్ తెరపైనే కాదు. రియల్గా కూడా హీరోనే. ఆయన సేవా కార్యక్రమాలే అందుకు నిదర్శనం. ఇందులో విశాల్ పాత్రకు సమానమైన పాత్ర నాది. అంతపెద్ద స్టార్ అయ్యుండి నాదిసమానమైన పాత్రైనా ఆయన ఒప్పుకోవడం నిజంగా గ్రేట్.” అన్నారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన విశాల్కీ, అడిగిందల్లా కాదనకుండా ఇచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు అని దర్శకుడు అన్నారు.