మన్యం కృష్ణ, నందితాశ్వేతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జెట్టి’. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘మత్స్యకారుల జీవితాల్లోని సమస్యల్ని చర్చించే చిత్రమిది. కొందరు స్వార్థంతో పోర్టుల పేరుతో మత్స్యకారుల జీవితాల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో చూపించబోతున్నాం’ అని చెప్పారు.
జెట్టి అంటే పోర్టు అని అర్థమని, మత్స్యకారుల జీవన విధానాన్ని వెండితెరపై హృద్యంగా ఆవిష్కరించామని నిర్మాత తెలిపారు. నందితాశ్వేతా మాట్లాడుతూ ‘పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది’ అని చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: వీరమణి, సంగీతం: కార్తిక్ కొడకండ్ల, నిర్మాణ సంస్థ: వర్ధని ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక.