మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకుడు. ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను ‘ధమాకా’ దర్శకుడు నక్కిన త్రినాథ్రావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. సప్తగిరి, ధన్రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుక్కు