Manjummel Boys | మలయాళ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఈ నెలలో హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ తాజాగా మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. గతవారం మలయాళంలో విడుదలైన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్'(Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. కేవలం రూ.5కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం తెలుగులోకి రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగుకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ మూవీని మార్చి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరాం ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహలను సందర్శించడానికి వెళ్లగా ఆ గ్యాంగ్లో ఒకరు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సినిమా రావడంతో ప్రేక్షకులు కాసులు వర్షం కురిపిస్తున్నారు.
#ManjummelBoys – Telugu – 15th March pic.twitter.com/dJkBB9BZPP
— Aakashavaani (@TheAakashavaani) March 3, 2024