Ponniyin Selvan Actors Remuneration | ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసిన ‘పొన్నియన్ సెల్వన్-1’ గురించి మాట్లాడుకుంటున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిత్రబృందం అటు నార్త్లో, ఇటు సౌత్లో వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మణిరత్నం ఈ చిత్రాన్ని కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో మేకర్స్ రూపొందించారు. కాగా ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ వంటి స్టార్ కాస్ట్ నటించింది. అయితే వీళ్ళ రెమ్యునరేషన్లే బడ్జెట్లతో పావు వంతు అయినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. ఈ క్రమంలో స్టార్ కాస్ట్ను ఎంపికచేసుకున్నాడు. అయితే వీళ్ళకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు కూడా ఇచ్చాడట. ఈ చిత్రంలో ‘కరికాలన్’ పాత్రలో నటించినందుకు విక్రమ్ రూ.15 కోట్ల వరకు తీసుకున్నాడట. ఆ తర్వాత అందాల తార ఐశ్వర్యరాయ్ రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ డ్యూయల్ రోల్లో కనిపించనుందని టాక్. ఇక ‘రాజరాజ చోళు’ని పాత్రలో నటించిన జయం రవి కూడా భారీగా రూ.8 కోట్లు తీసుకున్నాడట. ‘వంథియ దేవన్’ పాత్రలో నటించిన కార్తి రూ.5 కోట్లు, ‘కుందవాయి’ పాత్రలో నటించిన త్రిష రూ.2 కోట్లు తీసుకున్నారట. మలయాళి హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కోటీన్నర వరకు రెమ్యునరేషన్ అందకుందట.
పీరియాడిక్ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం ‘పొన్నియన్ సెల్వన్-1’ సెప్టెంబర్ ౩౦న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన 6 నుండి 9 నెలల్లోపు రెండో భాగం విడుదల కానుందని మణిరత్నం తెలిపాడు. కాగా మొదటి భాగాన్ని మణిరత్నం కేవలం 150రోజుల్లోనే పూర్తి చేశాడట. ఏ.ఆర్ రెహమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.