మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘జిన్నా’. సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్ నాయికలుగా నటిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకుడు. రేపు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక పాయల్ రాజ్ పుత్. ఆమె మాట్లాడుతూ…‘ మాస్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ చిత్రంలో పల్లెటూరి యువతి స్వాతి పాత్రలో నటించాను ఆమె పచ్చళ్లు అమ్ముకుంటూ జీవిస్తుంటుంది.
చాలా సహజంగా సాగే క్యారెక్టర్ ఇది. మంచు విష్ణు క్యారెక్టర్ ఎనర్జిటిక్గా ఉం టుంది. సినిమా బాగుంటేనే ఇవాళ ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. లేకుంటే అదే డబ్బులతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని మంచి కంటె ంట్ చూస్తున్నారు. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు’ అని చెప్పింది.