Manchu Manoj Second Marriage | మంచు మనోజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఫలితంతో సంబంధంలేకుండా విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే మనోజ్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రముఖ రాజకీయ వేత్త, దివంగత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తే మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరూ కలిసి సీతాఫల్ మండిలోని గణపతిని దర్శించి పూజలు చేయించారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. కాగా మనోజ్ పెళ్ళి విషయమై మీడియా ప్రతినిధులు ఆయన్ని ప్రశ్నించారు. దానికి మనోజ్ నవ్వుతూ ‘పెళ్ళి తన వ్యక్తిగత అంశమని, సమయం వచ్చినపుడు చెబుతానని’ అన్నాడు. దాంతో వీళ్ళ పెళ్ళి త్వరలోనే జరుగనున్నట్లు హింట్ ఇచ్చాడు. అయితే వీరిద్దరికి గతంలో వేర్వేరుగా పెళ్ళిళ్ళు అయ్యాయి.
మంచు మనోజ్ 2015లో ప్రణతిని వివాహం చేసుకోగా.. పరస్పర విభేదాలు రావడంతో నాలుగేళ్ళకు విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఒంటిరిగానే జీవిస్తున్నాడు. అయితే భూమా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి గతం నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక భూమా నాగిరెడ్డి దంపతులు మరణించిన తర్వాత మనోజ్ ఆ ఫ్యామిలీ కీలక సందర్భాల్లో కనిపిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరు దగ్గరయ్యారని తెలుస్తుంది. ఇక మౌనిక రెడ్డి రెండేళ్ళ క్రీతం తన భర్తతో విడాకులు తీసుకుంది. మనోజ్ సినిమాల విషయానికిస్తే గత రెండు మూడేళ్ళ నుండి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. కరోనా టైంలో ‘అహం బ్రహ్మస్త్ర’ అనే పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా రివీల్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు.