Manchu Manoj | మంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ జూన్ నెలాఖరులో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంతో మంచు ఫ్యామిలీ మూడో తరం నుంచి విష్ణు కుమారుడు అవ్రామ్ వెండితెరకి పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ బుడతడు తన మొదటి సినిమాతోనే ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్’ సొంతం చేసుకోవడం విశేషం. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అవ్రామ్ అందుకోగా, దీనిపై విష్ణు ఆనందం వ్యక్తం చేస్తూ, అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోపై విష్ణు సోదరుడు మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. “అభినందనలు అవ్రామ్.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను మై బాయ్. ఇలాగే ముందుకు సాగు నాన్నా. విష్ణు అన్న, మోహన్ బాబుతో కలిసి ఈ అవార్డు అందుకోవడం చాలా స్పెషల్. ఎంతో ప్రేమతో.. మనజ్ అని ఎక్స్లో (ట్విట్టర్) పోస్ట్ చేయడంతో, ఇది కేవలం చిన్నారి గెలుపుపై హర్షం వ్యక్తం చేయడమే కాక, మంచు బ్రదర్స్ మధ్య తిరిగి బంధం ఏర్పడిందన్న దానికి సంకేతంగా నెటిజన్లు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా మంచు ఫ్యామిలీలో నెలకొన్న ఆంతరిక వివాదాలు తెలుగు మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు, పోలీసు స్టేషన్ వరకు వెళ్లి ఆరోపణలు, ‘కన్నప్ప’కి పోటీగా ‘భైరవం’ విడుదల చేస్తానన్న మనోజ్ ప్రకటన ఇలా గతంలో జరిగిన గొడవలు ఇప్పటికీ అభిమానులకి గుర్తు ఉన్నాయి. కానీ తాజాగా అవ్రామ్ను అభినందిస్తూ మనోజ్ చేసిన పోస్ట్ వివాదాలకి చెక్ పెట్టినట్టుగా కనిపిస్తుంది.కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘కన్నప్ప’ సినిమా చూసిన తర్వాత మనోజ్ స్వయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చిత్రం గురించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.ఆ సమయంలో విష్ణు పేరు ఎత్తని మనోజ్ ఇప్పుడు మాత్రం విష్ణును ‘అన్నా’ అని ప్రేమగా సంబోధించడంతో, ఇద్దరి మధ్య మళ్లీ పాజిటివ్ రిలేషన్ మొదలైందనే చర్చ నడుస్తుంది.
Congratulations Avram ❤️❤️❤️…..so so proud of you my boy…. Keep shining nannaaaa 😘😘😘
This is so special with @IvishnuManchu anna and Nanna @themohanbabu garu also receiving this award …Lots of love ❤️❤️#SantoshamFilmAwards https://t.co/2IPOHHDRmN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 17, 2025