‘పుష్పా’ ఫ్రాంచైజీ, యానిమల్, ఛావా, సికిందర్, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో ఓకే ఏడాది వేలకోట్ల వసూళ్లు రాబట్టి సినీ సామ్రాజ్యానికి క్వీన్గా అవతరించింది రష్మిక మందన్న. ఇక ఏ హీరోయిన్కైనా ఈ స్థాయి ట్రాక్ రికార్డు కష్టమే అని అంతా అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి మలయాళ భామ మమితాబైజు ఊడిపడింది. ఆర్నెల్ల క్రితం ధనుష్తో ఆమె నటించిన ‘కర’ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ 50కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక అక్కడ్నుంచి మొదలైంది మమితాబైజు విజయవిహారం.
ప్రదీప్ రంగనాథ్తో ఆమె నటించిన ‘డ్యూడ్’ సినిమా వందకోట్ల వసూళ్లు రాబట్టింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి నటించిన ‘జననాయగన్’ 300కోట్లు, రీసెంట్గా విడుదలైన మలయాళ చిత్రం ‘బెత్లహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం 300కోట్లు, సూర్య తాజా బ్లాక్బస్టర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో 260కోట్లు.. ఇలా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన సినిమాల వసూళ్లతో వెయ్యికోట్ల మార్క్ని దాటేసింది మమితా బైజు. ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా 200కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం.