న్యూఢిల్లీ: ఇమ్రాన్ హస్మీ, మల్లికా షరావత్(Mallika Sherawat) మళ్లీ ఒక్కటయ్యారు. 20 ఏళ్ల బ్రేక్ తర్వాత ఆ ఇద్దరూ హగ్ ఇచ్చుకున్నారు. 2004లో మర్డర్ ఫిల్మ్ షూట్ టైంలో ఈ ఇద్దరి మధ్య గొడవైంది. ఆ తర్వాత ఆ ఇద్దరూ మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆనంద్ పండిట్ కూతురు రిసెప్షన్ వేడుకకు ఆ ఇద్దరూ హాజరయ్యారు. ఒకర్ని చూసి ఒకరు పలుకరించుకున్నారు. హగ్ ఇచ్చుకున్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పింక్ డ్రెస్సులో మల్లికా.. బ్లాక్ సూట్లో ఇమ్రాన్ హస్మీ తెగ మెరిసిపోయారు. మహేశ్ భట్ నిర్మించిన మర్డర్ చిత్రంలో ఆ ఇద్దరి బాడీ కెమిస్ట్రీ అప్పట్లో ఫుల్ సెన్షేషన్ క్రియేట్ చేసింది.