Yatra 2 | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వచ్చిన తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటించాడు. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తాజాగా ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు చాలా క్లీన్గా ఉందని జగన్ పాత్రలో జీవా జీవించేశాడని చెబుతున్నారు.
ఇక సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ డిలీటెడ్ (Yatra 2 Deleted Scene) సీన్ రిలీజ్ చేశారు. ఇక ఈ సీన్లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు, జగన్ను సీఎం చేయమని ఎమ్మెల్యేలు అంతా అధిష్టానంకు లేఖలు రాయడం, మరోవైపు ప్రతిపక్ష నాయకులు సీఎం జగన్పై బురద చల్లాలని చూడడం ఈ వీడియోలో చూడవచ్చు.