సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక సినీ సెలబ్రిటీలకు సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతుండగా,అవి అభిమానులలో ఆందోళన కలిగిస్తున్నాయి. మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, అందుకే మహేష్.. పూరీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని కొందరు గాసిప్స్ పుట్టించారు.
పూరీ జగన్నాథ్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి, బిజినెస్మేన్ చిత్రాలు మంచి విజయా సాధించాయి హ్యాట్రిక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు పూరీ జగన్నాధ్. చాలా రోజులుగా ‘జనగణమన’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మహేష్ బాబుకు స్క్రిప్ట్ వినిపించేందుకు పూరీ ఎంతో ట్రై చేస్తున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు కూడా చెప్పాడు. ఇప్పటికే రెండుసార్లు ఆయనకు కథ చెప్పాలని చూసి ఫెయిల్ అయ్యాడు పూరీ. ఫ్లాపుల్లో ఉంటే మహేష్ పట్టించుకోడని పూరీ జగన్నాథ్ కామెంట్స్ చేయడంతో ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిందనే కామెంట్స్ వినిపించాయి.
అయితే ఈ రోజు పూరీ జగన్నాథ్ బర్త్ డే కావడంతో మహేష్ తన సోషల్ మీడియా ద్వారా పూరీ జగన్నాథ్కి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. హ్యాపీ బర్త్ డే పూరీ సర్.. సంతోషం, ఆరోగ్యంతో నిండిన నమ్మశక్యంకాని సంబరాల ఏడాదిని గడపండి అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తొలగిపోయాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే పూరీకి విషెస్ చెప్పిన వారందరికి ఛార్మీ రిప్లై ఇస్తుంది. పూరీ జగన్నాథ్ ఈ ఏడాది జనవరి 11 నుంచి సోషల్ మీడియాకు దూరమయ్యారు. బ్యాక్ టు బ్యాక్ వర్క్ వల్ల కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.