బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. సక్సెస్ ఫుల్గా సాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కే రామ్ చరణ్ హాజరై సందడి చేయగా, అనంతనం రాజమౌళి కొరటాల శివ కలిసి కట్టుగా వచ్చారు.వీరు పసందైన వినోదం పంచారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హాజరు కానుండగా, ఇప్పటికే షో షూటింగ్ పూర్తైంది. షోకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి బయటకు వచ్చింది. దసరా సందర్భంగా ప్రసారం కానుందని తెలుస్తుండగా, షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం మేరకు ఈ ఎపిసోడ్ హోరాహోరీగా నడిచిందని , మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ఇరువురు హీరోల ఫ్యాన్స్కి కిక్కిస్తుందని అంటున్నారు. ఇక ఈ ఆటలో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారని, ఆ మొత్తాన్ని ఛారిటీకి డొనేట్ చేశారని తెలుస్తోంది. త్వరలో ప్రభాస్ ని కూడా ఈ షోకి పిలిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.