అగ్రకథానాయకుడు మహేష్బాబుకు మోకాలు సర్జరీ జరిగినట్లు తెలిసింది. స్పెయిన్లో ఆయన శస్త్రచికిత్స చేసుకున్నట్లు చెబుతున్నారు. గతకొంతకాలంగా మహేష్బాబు మోకాలునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఆ నొప్పి అధికమవ్వడంతో వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకున్నట్లు తెలిసింది. స్పెయిన్లో ఈ శస్త్రచికిత్సను నిర్వహించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమస్య నుంచి కోలుకోవడానికి కొద్ది రోజులు సమయం పట్టడంతో విశ్రాంతి కోసం మహేష్బాబు దుబాయ్ వెళ్లారని చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానున్నది.