ప్రస్తుతం టాలీవుడ్ దర్శకనిర్మాతలు దక్షిణాది సినిమాలకు నార్తిండియా మార్కెట్లో క్రేజీ పెంచుకునే ట్రెండ్ కొనసాగుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా రిలీజైన కార్తికేయ 2 హిందీలో మంచి వసూళ్లు రాబడుతోంది. నిఖిల్ ముఖం నార్తిండియా ప్రేక్షకులకు కొత్త. అయినా సినిమాకు వస్తున్న స్పందన ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుందన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మహేశ్బాబు (Mahesh Babu)తో చేయబోతున్న ఈ సినిమాను నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే మరోవైపు మహేశ్బాబు మాత్రం పాన్ ఇండియా మార్కెట్పై ఆసక్తి చూపించడం లేదట.
అంటే మొత్తానికే కాదు..కేవలం రాజమౌళి (ss Rajamouli) సినిమాతో అయితేనే పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సేఫ్ జోన్లో ఉండొచ్చని మహేశ్ అభిప్రాయపడుతున్నాడట. ఇండియన్ సినిమాలో జక్కన్నకు బ్రాండ్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటి స్టార్ డైరెక్టర్ హిందీలోకి ఎంట్రీ ఇవ్వడం సేఫ్గా ఉంటుందని అనుకుంటున్నాడని ఇండస్ట్రీ సర్కిల్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
గతంలో ఇదే ప్రొడక్షన్ హౌస్ భీమ్లానాయక్ హిందీలో విడుదల చేయాలని ఫిక్సైన తర్వాత మళ్లీ వెనక్కి కూడా తగ్గడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. మొత్తానికి హిందీలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం మినిమం గ్యారంటీ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడని తాజా వార్తలతో అర్థమైపోతుంది.