Sarkaru vaari paata | సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. మధ్యలో అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన షూటింగ్ ఇంకా 40 శాతం మిగిలిపోయింది. మరోవైపు ఏప్రిల్ 1న కూడా సినిమా విడుదల కావడం లేదు. దీన్ని మరోసారి పోస్ట్ పోన్ చేశారు. అందుకే ఆ రోజు చిరంజీవి ఆచార్య విడుదల కానుంది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట అప్డేట్ కోసం చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు. వాళ్ల కోసం అదిరిపోయే న్యూస్ చెప్పాడు దర్శకుడు పరశురామ్.
సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ జనవరి 26 రిపబ్లిక్ డే కానుకగా అభిమానులకు తెలుపనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పరుశురామ్ ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు అభిమానులకు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.. రిపబ్లిక్ డే రోజు సర్కారు వారి పాట నుంచి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నామంటూ ఒక పోస్టర్ కూడా విడుదల చేశాడు దర్శకుడు పరశురామ్. మరి అది ఏంటి అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. విడుదల తేదీ గురించి చెప్పబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఉంటుందని తెలుస్తోంది. కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్, 14 reels సంయుక్తంగా సర్కారు వారి పాట సినిమా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్తో సర్కారు వారి పాట వస్తుంది.