టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) లీడ్ రోల్లో నటించిన చిత్రం మేజర్ (Major) చిత్రంపై. మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
మంచి సినిమా తెరకెక్కించిన డైరెక్టర్కు, నిర్మించిన ప్రొడ్యూసర్కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. దీనిపై మేజర్ నిర్మాతల్లో ఒకరైన మహేశ్ బాబు రీట్వీట్ చేశాడు. మీ ప్రశంసలకు ధన్యవాదాలు. మీ మాటలు ఖచ్చితంగా మేజర్ టీంకు ప్రోత్సాహం అందించేలా ఉన్నాయి. మేజర్ మీకు చాలా బాగా నచ్చడం మాకు సంతోషాన్ని కలిగిస్తోందని మహేశ్ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మేజర్లో సయీ మంజ్రేకర్ (saimanjrekar) హీరోయిన్గా నటించింది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా మేజర్ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది.
Thank you @alluarjun! Your words will surely encourage the young team of #Major. Happy to know that you loved the film ♥️ https://t.co/UVLHEQygcg
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2022