Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు రియల్ ఎస్టేట్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన క్రమంలో , రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదులో మహేశ్ బాబు పేరును చేర్చారు. ఒక వైద్యురాలు, ఫోరంలో ఫిర్యాదు చేస్తూ.. బ్రోచర్లో మహేష్బాబు ఫోటోతో ఉన్న వివరాలను చూసి బాలాపూర్ గ్రామంలో లేఔట్లో ప్లాట్లు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ప్రతి ప్లాట్కు రూ.34.80 లక్షలు చెల్లించిన తర్వాత, అసలు ఆ లేఔట్కు అనుమతులు లేవని తేలిందని తెలిపారు. డబ్బు తిరిగి ఇవ్వాలని డెవలపర్స్ను ఒత్తిడి చేయగా, సంస్థ ఎండీ కంచర్ల సతీష్ చంద్రగుప్తా కేవలం రూ.15 లక్షల వరకే వాపసు ఇచ్చారని బాధితులు వివరించారు.
ఈ నేపధ్యంలో ఫోరం.. సాయిసూర్య డెవలపర్స్, సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా, ప్రచారకర్త మహేష్బాబులను ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు జూలై 8 సోమవారం నాటికి వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా వినియోగదారుల ఫోరంలో హాజరుకావాల్సిందిగా సూచించింది. ఇందులో మహేష్ బాబుని మూడో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. మరి దీనిపై మహేష్ బాబు ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకో మూడు నాలుగేళ్లు పడుతుంది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన్న మరో భారీ బడ్జెట్ చిత్రం చేస్తుండగా, ఈ మూవీ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా ఈసినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు మహేష్ బాబు.