హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకలు శనివారం హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సినీతారలు సందడి చేశారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. అవార్డుల ప్రదానోత్సవానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ హాజరయ్యారు. తొలి రోజైన శనివారం 2019 సంవత్సరానికి తెలుగు సినిమా అవార్డులు ప్రకటించారు. మహర్షి సినిమాకు మహేశ్బాబు ఉత్తమ నటుడిగా ఎంపపీ సంతోష్కుమార్ నుంచి అవార్డును అందుకొన్నారు. కరోనా కారణంగా గతేడాది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించలేదు.
గ్రీన్ఇండియా చాలెంజ్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సినీనటులందరికీ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ సైమా అవార్డుల ప్రదానోత్సవంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మూడేండ్ల క్రితం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభమైందని, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ నటీనటులు దీనిని ముందుకుతీసుకెళ్లడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తంచేశారు.
ఉత్తమ చిత్రం- జెర్సీ
ఉత్తమ నటుడు-మహేశ్బాబు(మహర్షి)
ఉత్తమ నటి- సమంత(ఓ బేబీ)
ఉత్తమ దర్శకుడు-వంశీ పైడిపల్లి( మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు-దేవిశ్రీప్రసాద్(మహర్షి)