సాహిత్య పరిశోధకుడు సిరివెన్నెల సీతారామశాస్త్రిని కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు ఫిలిం ఛాంబర్కు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా బాలకృష్ణ, చిరంజీవి, హీరో మహేష్ బాబు, నాగార్జున, రాజశేఖర్ దంపతులు కూడా సిరివెన్నెలకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ హీరోలందరికి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలు రాసారు సిరివెన్నెల. మహేష్ నటించిన చాలా సినిమాలకు సిరివెన్నెల పాటలు రాసారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సిరివెన్నెల లేని లోటు ఎవరు పూడ్చనిది అంటూ బాలయ్య, చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. నాగార్జున కూడా సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సినిమాలకు కూడా సాహిత్యం అందించినట్టు చెప్పుకొచ్చారు.