Mahesh Babu | మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన బ్యూటీ కృతి సనన్. తొలి సినిమా ఫెయిలైనప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఆమె నటించిన ‘హీరో పంతీ’ హిందీ ఆడియన్స్ని ఆకట్టుకోవడంతో అక్కడ సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. తెలుగులో నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రం చేయగా, ఈ మూవీ నిరాశనే మిగిలిచ్చింది. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్కి చాలా రోజుల పాటు దూరంగా ఉంది. ఇక ఆ మధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో కృతి టాలీవుడ్కు దూరంగా ఉండిపోయింది.
అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ తెగ హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణం ఇటీవల కాలంలో వ్యాపారవేత్త కబీర్ బహియాతో ఆమె ప్రేమలో ఉన్నట్టు గాసిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి ఫోటోలు, వీడియోలు అనేకసార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట లండన్లోని లార్డ్స్ స్టేడియంలో ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ వీక్షిస్తూ కెమెరాలకు చిక్కారు. కబీర్ స్వయంగా కృతితో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ఈ రిలేషన్ అఫీషియల్ అయినట్టేనని ముచ్చటించుకుంటున్నారు. కబీర్కు లండన్లో వ్యాపారాలు ఉండటంతో ఎక్కువగా అక్కడే ఉంటాడట. కృతి సైతం షూటింగ్లు లేనప్పుడు ఎక్కువ సమయం అతనితోనే గడుపుతున్నట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో జరిగిన ఓ స్నేహితుడి పెళ్లిలో వీరిద్దరూ కలుసుకున్నారట. ఆ పరిచయం ప్రేమగా మారినట్టు చెబుతున్నారు. ఒకరి అభిప్రాయాలు, ఆసక్తులు కలవడంతో రిలేషన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు సమాచారం. పెళ్లి విషయంపై స్పష్టత లేదు కాని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లి జరుగవచ్చని బాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కృతి సనన్ పెళ్లి తర్వాత కూడా సినిమాలను యధావిధిగా చేస్తూ నటనా ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.