Mahesh Babu | టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో క్రేజీ మూవీ మహేష్ 28. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారనేది ఈ వార్తల సారాంశం. తండ్రీ కొడుకులుగా మహేష్ రెండు క్యారెక్టర్స్లో కనిపిస్తారని సమాచారం.
గతంలో ‘నాని’ సినిమాలో మహేష్ ఇలా తండ్రీ కొడుకుల పాత్రలను పోషించారు. ఇన్నాళ్లకు మరోసారి ఆయన ఈ తరహా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.