Mahesh babu Meet Bill Gates | మహేష్బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఇటీవలే ప్రైమ్లో స్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్ తాజాగా బిల్ గేట్స్ను కలిశాడు.
మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరిస్తున్నాడు. గత కొన్నిరోజులగా ఈయన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా అమెరికా పర్యటనలో న్యూయార్క్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను మహేష్బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కలిశారు. మహేష్బాబు ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘బిల్గేట్స్ను కలవడం ఆనందగా ఉంది. ప్రపంచంలోని గొప్ప విజనరీస్లో ఒకరు. అంతకంటే ఎక్కువ వినయంతో ఉన్నాడు. నిజంగా మీరు ఒక స్పూర్తి’ అంటూ ట్విట్టర్లో వెల్లడించాడు. ఇక మహేష్ రెండు రోజుల్లో ఇండియా రానున్నాడు. రాగానే త్రివిక్రమ్ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ను విననున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ ప్రారంభించనుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.