‘తొమ్మిది పాత్రల నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఫస్ ్టసిట్టింగ్లోనే దర్శకుడిని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఈ సినిమాను అంగీకరించాను’ అని అన్నారు శర్వానంద్. సిద్ధార్థ్తో కలిసి ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. అజయ్ భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అదితీరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్ కథానాయికలు. అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. గురువారం హైదరాబాద్లో ఈ చిత్ర ట్రైలర్ను విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ‘తెలుగు తెరపై ఇప్పటివరకు ఆవిష్కృతం కాని ఎమోషన్స్తో వినూత్నంగా ఉంటుంది. సముద్రం నిశ్శబ్దంగా ఉంటూనే మరోవైపు ఎగిసిపడుతుంది. ఈ సినిమాలో సైలెంట్గా ఉండేది ఎవరు?ఎగిసిపడేవారెవరు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘సినిమాలో ప్రతి పాత్రకు హీరో లక్షణాలుంటాయి. అనవసరమైన క్యారెక్టర్స్ కనిపించవు’ అని చెప్పారు. కథానాయికగా తనను కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిదని అనూ ఇమ్మాన్యుయెల్ పేర్కొంది.