భారతీయ పౌరాణిక ఇతిహాసం మహాభారతాన్ని వెండితెర దృశ్యమానం చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మహాభారతం వెబ్సిరీస్గా తెరకెక్కబోతున్నది. అల్లు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన ఈ భారీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టబోతున్నారు.
డిస్నీ హాట్స్టార్లో మహాభారత్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సిరీస్ గురించి సోమవారం ఓ ట్వీట్ చేసింది. ‘మహాభారత ఇతిహాసాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో తీర్చిదిద్దబోతున్నాం. ఈ అత్యద్భుత దృశ్యకావ్యం కోసం వేచి చూస్తూ ఉండండి’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.