MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం సీక్వెల్స్తో హిట్లు కొడుతుంది. ఇప్పటికే ఈ ఏడాది టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టిన నాగవంశీ.. మరో క్రేజీ సినిమాకు సీక్వెల్ తీసుకోస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్.
కాలేజీ బ్యాక్డ్రాప్లో వచ్చే సినిమాలకు యూత్ నుంచి ఎప్పుడు ఆదరణ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. స్టోరీ లేకపోయిన యువతకు నచ్చే కథాంశాలు ఉండి రెండు గంటలు ఎంటర్టైన్ చేస్తే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లే. అయితే ఇదే కోవలోకి వస్తుంది సూపర్ హిట్ అందుకున్న చిత్రం మ్యాడ్. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాకు ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) అంటూ సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్ సంబంధించి శుక్రవారం అధికారికంగా పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా మంచి విజయం సాధించాలని చిత్రయూనిట్కు విషెస్ తెలిపాడు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఈ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
#MADSquare BEGINS!! 🕺💥
It’s time to take the FUN to new heights, Here are some clicks from the pooja ceremony which was held on UGADI. ✨🤩
Thank you Starboy #Siddu & @anudeepfilm garu for gracing the ceremony. ❤️@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya… pic.twitter.com/uW4hYRDLFP
— Sithara Entertainments (@SitharaEnts) April 19, 2024