మాధురీ దీక్షిత్.. ఒకప్పుడు ఈ పేరు వింటే కుర్రకారు ఊహాలోకంలో విహరించేవారు. ఆమె నటతో పాటు డ్యాన్స్కి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యేవారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న మాధురీ దీక్షిత్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఓ వీడియోని షేర్ చేసింది.
శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా చాలా అవసరం అనే సంగతి మనందరికి తెలిసిందే. ముఖ్యంగా నటీమణులు యోగాతో తమ అందాన్ని కూడా పెంచుకుంటున్నారు.నటి మాధురీ దీక్షిత్ నిత్యం యోగా చేస్తుండగా, ఆమె తన అభిమానుల కోసం కొన్ని ఆసనాలు చేసి చూపించింది. యోగా వ్యాయామంలో భాగం అయింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్ తన ఆసనాలకి సంబంధించిన వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది.