‘మాది చిత్తూరుజిల్లా మంగళంపేట. ఆరు దాటితే బస్సులేని ఊరినుంచి వచ్చాను. అక్కడినుంచి ఇక్కడి దాకా రావటానికి కారణం ఇద్దరు వ్యక్తులు. వారిలో ఓ వ్యక్తి పవన్కల్యాణ్ అయితే, రెండోవ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. కల్యాణ్గారి పేరు నా పేరులో పెట్టుకున్నా. త్రివిక్రమ్గారి పేరు నా గుండెల్లో పెట్టుకున్నా’ అన్నారు దర్శకుడు కల్యాణ్శంకర్. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం ‘మ్యాడ్’. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీగౌరీప్రియ, అనంతిక సునీల్కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధానపాత్రధారులుగా సూర్యదేవర హారిక నిర్మించిన ఈ చిత్రం థాంక్స్మీట్ సోమవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ నా మిత్రుడు అనుదీప్ని తొలిసారి కలిసినప్పుడే అనుకున్నా ఇతను ఖచ్చితంగా గొప్పస్థాయిలో ఉంటాడని. ‘జాతిరత్నాలు’తో నా నమ్మకం నిజమైంది. ఇక నేను ఈ కథ తీసుకొని చినబాబుగారిని కలిశాను. అంతే నాతో పాటు 40మంది జీవితాలు మారిపోయాయి. ఇంతపెద్ద విజయాన్నిచ్చిన ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిది’ అన్నారు.