నితిన్, కృతిశెట్టి, కేథరీన్ ట్రెసా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.
ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మూడో పాటను విడుదల చేశారు. ‘అదిరిందే…’ అంటూ సాగే ఈ పాటను మహతి స్వరసాగర్ స్వరపర్చగా.. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. సంజిత్ హెగ్డే పాడారు.
హీరో హీరోయిన్ల డ్యూయెట్గా ఈ పాటను చిత్రీకరించారు. నితిన్, కృతిశెట్టి స్టెప్స్, విదేశీ లొకేషన్స్ ఈ పాటలో ఆకట్టుకోనున్నాయి. ఈ నెల 29 చిత్ర ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు.