నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ నాయికలుగా నటించారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నికితారెడ్డి నిర్మించారు. ఎం.ఎస్ రాజశేఖర్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్మీట్ను శనివారం హైదరాబాద్లో నిర్వహించారు. హీరో నితిన్ మాట్లాడుతూ…‘నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా రెవెన్యూ బాగుంది. తొలిసారి నా జానర్ మార్చి యాక్షన్ మాస్ సినిమా చేశాను. వెన్నెల కిషోర్ కామెడీకి నవ్వుతున్నారు.
ఇకపైనా కష్టపడుతూ మంచి చిత్రాలు చేస్తాను’ అన్నారు. నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ…‘ఫస్ట్ డే బాక్సాఫీస్ నుంచి వస్తున్న షేర్స్ బాగున్నాయి. నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ డే వన్ కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. పాండమిక్ తర్వాత ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎం.ఎస్ రాజశేఖర రెడ్డి, డీవోపీ ప్రసాద్ మూరెళ్ల, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.