మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాటరాని మౌనమిది’. సుకు పూర్వాజ్ దర్శకుడు. పీసీఆర్ గ్రూప్ సమర్పణలో రుద్ర పిక్చర్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి ప్రేక్షకుల అభిరుచికి తగిన కథతో, అన్ని అంశాలను మేళవించి రూపొందించిన చిత్రమిది. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. అర్చన, అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అషీర్ లుక్.