Maa Oori Polimera-2 Movie | రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్స్టార్లో నేరుగా విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్లో ఉంది. ఇక సత్యం రాజేష్ నటనైతే వేరే లెవల్. అప్పటివరకు కామెడియన్గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సీక్వెల్ను వెంటనే ప్రకటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ గట్రా సీక్వెల్పై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. చేతబడులు అసలు ఉన్నాయా అన్న సందిగ్ధంలో ఒకే చితిపై రెండు శవాలు కాలడం అంటూ ట్రైలర్ ఉత్కంఠ భరితంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఊరిపొలిమేరలో ఉన్న గుడి, గుడి చుట్టూ దాగున్న మిస్టరీ, దాన్ని చేధించడానికి వచ్చిన పొలీస్ ఆఫీసర్ ఇలా ట్రైలర్ మొత్తం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లా సాగింది. మరీ ముఖ్యంగా పాములతో చేతబడి చేయడం సినిమాపై అమితాసక్తి క్రియేట్ చేసింది. ఈ సారి సత్యం రాజేష్ బ్లాక్ మేజిక్లో మరింత ఆరితేరినట్లు చూపించడం, అనంత పద్మనాభస్వామి గుడికి, ఊర్లో ఉన్న గుడికి లింకేదో ఉన్నట్లు చెప్పడం ట్రైలర్కే హైలెట్లా అనిపించింది.
చూస్తుంటే ట్రైలర్తో సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. దర్శకుడు సైతం స్టోరీని పెద్దగా రివీల్ చేయకుండా తెలివిగా ట్రైలర్ను కట్ చేశాడు. ట్రైలర్లో కొన్ని సీన్లయితే హై స్టాండడ్స్లో అనిపించాయి. అనీల్ విశ్వనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తొలి పార్టుకు వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ సీక్వెల్ను ఎట్టి పరిస్థుతుల్లో థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని మేకింగ్కు కాస్త ఎక్కువ ఖర్చే పెట్టినట్లు ట్రైలర్తో స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాను నవంబర్ 2న రిలీజ్ కానుంది.