‘మా ఊరి పొలిమేర-2’ చిత్రానికి అన్ని కేంద్రాల్లో చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అన్నారు నిర్మాత గౌరికృష్ణ. ఆయన నిర్మాణంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం థాంక్స్ మీట్ను నిర్వహించారు. ఈ విజయం తమ కష్టాన్ని మరచిపోయేలా చేసిందని వంశీ నందిపాటి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కథలోని సస్పెన్స్, అనూహ్య మలుపులు ప్రేక్షకులను థ్రిల్కు గురిచేస్తున్నాయని చెప్పారు. టీమ్ అందరి సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని సత్యం రాజేష్ తెలిపారు.