Sri Simha | ‘మత్తువదలరా’ వంటి వినూత్న కథతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు శ్రీ సింహా. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటన, అభినయంతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్గా కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన తెల్లవారితే గురువారం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ ఫ్లాప్గా మిగిలింది. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ‘ఉస్తాద్’ ఒకటి. ఫనిదీప్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంఛ్ అయింది.
ఈ లాంఛింగ్ కార్యక్రమానికి ఎంఎం కీరవాణి, శ్రీవల్లీలు గెస్ట్లుగా హాజరయ్యారు. వారాహి చలన చిత్రం, కృషి ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై రజనీకొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఈవెంట్లోనే మేకర్స్ టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అకీవా.బి సంగీతం అందించగా పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనితో పాటుగా శ్రీసింహా ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.
USTAAD launched in a style 🎬
Directed by Phani deep @Simhakoduri23 @VaaraahiCC @SaiKorrapati_ @krishient @vamsikaka #USTAAD pic.twitter.com/fywUgD7l1H
— Sreedhar Marati (@SreedharSri4u) May 26, 2022