Major movie | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలలో ‘మేజర్’ ఒకటి. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ పాత్రలో అడవిశేష్ నటించాడు. ఈ చిత్రానికి ‘గూడాఛారి’ ఫేం శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ట్విట్టర్లో పోస్ట్ వేసింది.
పాండమిక్ తర్వాత అతి తక్కువ రేట్లతో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. తెలంగాణలో సాధారణంగా మల్టీప్లెక్స్లలో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ. 175 ఉండేవి. కానీ మేజర్ చిత్రానికి రూ.100 తగ్గించి మల్టీప్లెక్స్లలో రూ.195, సింగిల్ స్క్రీన్లలో రూ.150 టిక్కెట్ రేట్లు ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఆంధ్రాలో మల్టీప్లెక్స్లో రూ.177, సింగిల్ స్క్రీన్లలో రూ.147 గా ఉండనుంది. ఇంత తక్కువ రేట్లపై అడవిశేష్ స్పందిస్తూ ‘మేజర్ చిత్రాన్ని అందరు చూడాలనే ఉద్ధేశ్యంతో తక్కువ రేట్లకు సినిమాను ప్రదర్శితం చేయనున్నట్లు’ తెలిపాడు.
జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
#MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u
Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK
— Adivi Sesh (@AdiviSesh) May 27, 2022