కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాగచైతన్య, సాయిపల్లవిల జోడీకి ప్రేక్షకులను ఫిదా అయ్యారు.. విడుదలైన మొదటి రోజునే.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.
లవ్ స్టోరీ చిత్రం రిలీజ్కి సిద్ధంగా ఉన్న సినిమాలకు ధైర్యాన్ని అందించింది. అయితే కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆహాలో లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.నాగచైతన్య, సాయిపల్లవిలు జోడీగా నటించిన లవ్ స్టోరీ సినిమా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా.. లవ్ స్టోరీ ట్రైలర్ సైతం విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య.. జుంబా కోచ్. .. రేవంత్ పాత్రలో .. సాయి పల్లవి మౌనిక పాత్రలో నటించి మెప్పించారు.