Lokesh Kanagaraj -jayam Ravi | ‘మా నగరం’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా కోలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఖైదీ’, ‘మాస్టర్’ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లవడంతో దక్షిణాదిన లోకేష్ పేరు మారు మోగిపోయింది. ఇక ఇటీవలే ‘విక్రమ్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ఫ్యాన్ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో ‘విక్రమ్’తో లోకేష్ నిరూపించాడు. కమల్ హాసన్ను రూ.400 కోట్ల క్లబ్లో నిలబెడ్డాడు. ఒక్క తమిళంలోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో ఈ చిత్రం రెండింతలు కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం లోకేష్ విజయ్ దళపతితో తన తదుపరి సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే లోకేష్ తాజాగా తమిళ హీరో జయం రవికి ఓ కథను నెరేట్ చేసినట్లు తెలుస్తుంది. కథ నచ్చడంతో జయం రవి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే లోకేష్ జయం రవిని హీరోగా పెట్టి తీస్తాడా లేదంటే LCUలో భాగంగా ఓ సినిమాలో కీలకపాత్ర కోసం కథ నెరేట్ చేశాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఎవరి ప్రాజెక్ట్లతో వాళ్లు బిజీగా ఉన్నారు. జయం రవి ప్రస్తుతం నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా.. మూడు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక లోకేష్, విజయ్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.