మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన సినిమాతో హీరోయిన్గా పరిచయమైన మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాలోనే ఎంతో పరిణితితో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఉప్పెన సాధించిన విజయంతో కృతి శెట్టికి ఆఫర్స్ క్యూ కట్టాయి. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి .. ఇంద్రగంటి మహాన్కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రంలోను నటిస్తుంది.
ఇక రీసెంట్గా తమిళ దర్శకుడు లింగ్ స్వామి తెరకెక్కిస్తున్న షూటింగ్లో జాయిన్ అయింది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఓ సన్నివేశంలో భాగంగా సీనియర్ నటుడు నాజర్-కృతిశెట్టిల మధ్య సీన్ తెరకెక్కిస్తుండగా, ఆమె సరైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదట. ఈ సీన్ కోసం కృతి చాలా టేకులు కూడా తీసుకందని అంటున్నారు.
అయితే ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన లింగు స్వామి..కృతి శెట్టికి చీవాట్లు పెట్టాడట. సీనియర్ నటుడితో నటించాల్సి వచ్చినప్పుడు ఆ సన్నివేశానికి సంబంధించి రిహార్సల్ చేయాలి కదా అని సూచించాడట. ఉప్పెనలో విజయ్ సేతుపతి లాంటి స్టార్తో నటించిన కృతిశెట్టి.. రామ్ సినిమాలో నాజర్ దగ్గర ఎందుకు అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయిందో అని జనాలు ముచ్చటించుకుంటున్నారు. కొందరు ఈ వార్త అంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు కూడా.