సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ భార్య లతా స్పందించారు. సాధారణ హెల్త్ చెకప్లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారు అని అన్నారు.
అక్టోబర్ 25న రజినీకాంత్ భారత ప్రభుత్వం ( Indian government) చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke award) అందుకున్న విషయం తెలిసిందే అలాగే ఆయన కూతురు సౌందర్య రూపొందించిన ప్రజలకు ఉపయోగపడే వాయిస్ బేస్డ్ సోషల్మీడియా ప్లాట్ఫాం HOOTE ( HOOTE APP)యాప్ను కూడా లాంఛ్ చేశారు.
కాగా, శివ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన అన్నాత్తే చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదలవుతుంది. జగపతిబాబు, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.