Kushboo Sunder | ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇంట విషాదం అలుముకున్నది. నటి సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపిన ఖుష్బూ.. భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ‘మీతో కలకాలం ఉండాలని ఎంత కోరుకున్న. కానీ, వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి. నా సోదరుడు తిరిగి రావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
అన్నయ్య చెప్పినట్లుగా.. జీవిత ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని’ భావోద్వేగానికి లోనైంది. ఇదిలా ఉండగా.. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా ఖాన్ శనివారం తుదిశ్వాస విడిచారు. ఖుష్బుకు అబ్దుల్లా, అబూ బకర్, అలీ అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. అబ్దుల్లా పలు సినిమాల్లో నటించారు.