Kshanam 2 | ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలో క్షణం (Kshanam) ఒకటి. మిస్టరీ థ్రిల్లర్గా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో అడివిశేష్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించారు.
కాగా ఈ క్రేజీ చిత్రానికి సీక్వెల్కు అంతా రెడీ అవుతుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆసక్తికర విషయమేంటంటే ఫస్ట్ పార్టులో నిజాయితీ గల పోలీసాఫీసర్ రవిచౌదరిగా నటించిన సత్యం రాజేశ్ సీక్వెల్లో ప్రధాన పాత్రలో నటించబోతున్నాడట. మా ఊరి పొలిమేర 2తో థ్రిల్ అందించేందుకు వస్తున్న సత్యం రాజేశ్ క్షణం 2లో లీడ్ రోల్ చేస్తున్నాడన్న అప్డేట్ మూవీ లవర్స్కు ఖచ్చితంగా ఎక్జయిట్మెంట్ కలిగించే విషయమే.
అయితే క్షణం 2ను ఎవరు నిర్మించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించనున్నారు మేకర్స్. ఫస్ట్ పార్టులో ఆదాశర్మ, సత్యదేవ్, వెన్నెల కిశోర్, రవివర్మ కీలక పాత్రలో నటించగా.. సీక్వెల్లో ఎవరెవరు కనిపిస్తారనేది చూడాలి మరి.