Kritisanon | గతకొంత కాలంగా ప్రభాస్, కృతి సనన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు ప్రభాస్ ఇటు కృతి ఎన్నో సార్లు అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసారు. అయినా కానీ వీరిమధ్య రూమర్స్ ఆగడంలేదు. కాగా తాజాగా కృతి సనన్ ఓ ఇంటర్వూలో ప్రభాస్తో రిలేషన్పై క్లారిటీ ఇచ్చేసింది. గతంలో ఓ టీవీషోలో వరుణ్ ధావణ్ కరణ్తో ముంబైలో లేని ఓ వ్యక్తి హృదయంలో కృతి ఉందని, ఇప్పుడు ఆయన దీపికాతో సినిమా చేస్తున్నాడని చేసిన వ్యాఖ్యలు వీళ్ల రిలేషన్పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇక అప్పటి నుంచి వీళ్లిద్ధరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ ఊపందుకున్నాయి.
కాగా తాజాగా ఇదే విషయాన్ని కృతిసనన్ వివరిస్తూ వరుణ్ చేసిన వ్యాఖ్యలతో తన ఫ్రెండ్స్ అందరూ కంగ్రాట్స్ అంటూ మేసేజ్ చేశారని, పెళ్లెప్పుడు అని అడిగారిని చెప్పింది. అయితే మా మధ్య ఏమిలేదని బదులిచ్చినట్లు తెలిపిందే. ఇక ఆ సమయంలోనే ప్రభాస్కు ఫోన్ చేసి వరుణ్ చేసిన పనిని చెబితే.. అలా ఎందుకు చేశారని ప్రభాస్ అన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వీళ్లద్ధరూ కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవిలో ప్రేక్షకులు ముందుకు రానుంది.