బాలీవుడ్ కథానాయిక కృతిసనన్ నటించిన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ కురచ దస్తుల్లో కనిపించడంతో సోషల్మీడియాలో ఆమెపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. మన సంస్కృతికి విరుద్ధంగా ఆమె ప్రవర్తన ఉందని, సోదరుడికి కట్టే రాఖీని కుక్కకు కట్టడం ఏంటని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కథానాయిక కంగనారనౌత్ సైతం కృతిసనన్ వస్త్రధారణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు ధరించడానికి ఎన్నో సంప్రదాయ వస్ర్తాలు ఉండగా బికినీ ధరించి రాఖీ కట్టడమేంటని కంగనా ప్రశ్నించింది. తాజాగా ఈ విమర్శలపై కృతిససన్ స్పందించింది. మహిళలు ధరించే దుస్తులను సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవానికి ముడిపెట్టే పద్ధతి ఎప్పుడు మారుతుందని ప్రశ్నించింది.
‘ఫ్యాషన్ అనేది ఎన్నో ఏళ్లుగా మార్పు చెందుతున్నది. కానీ ఇప్పటికీ మహిళా గౌరవాన్ని ఆమె దుస్తుల్లోనే కొలుస్తున్నారు. పండగల ఔన్నత్యం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. సం స్కృతి, సంప్రదాయాలు మహిళల హృదయాల్లో ఉంటాయి. ఆమె ధరించే దుస్తుల్లో కాదు’ అని కృతిసనన్ పేర్కొన్నది.